గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్‌ తీసుకున్న

గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్‌లో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు పోలీసులు. ఓ రాజకీయ నాయకుడి కుమారుడు రాత్రి కొందరికి విందు ఇచ్చాడని.. ఈ సమయంలోనే కొకైన్‌ తీసుకున్నట్టు గుర్తించారు. హోటల్‌లో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ రాజకీయ నాయకుడి కుమారుడితో సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారు ముగ్గురు గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో ఉన్నారు.

గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం

గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్‌ తీసుకున్న కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాడిసన్ హోటల్‌ లో సదరు యువకులు గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారు. వారిలో ఒక ప్రముఖ బీజేపీ నేత కుమారుడితో పాటు వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నాడు. పోలీసులు పక్కా సమాచారంతో రాడిసన్ హోటల్‌పై దాడి చేశారు. డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించి ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.

Updated On 25 Feb 2024 10:22 PM GMT
Yagnik

Yagnik

Next Story