భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో నాటు తుపాకితో భార్యపై కాల్పులు జ‌రిపాడు ఓ భర్త. పోలీసులు తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. భోజ్యాతండా పంచాయతీ పరిధిలోని పుల్లుడు తండాకు చెందిన లావుడ్యా సామ, శాంతి భార్యాభర్తలు. వీరికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం.

భద్రాద్రి కొత్తగూడెం(Badradri Kothagudem) జిల్లా జూలూరుపాడు(Julurupadu) మండలంలో నాటు తుపాకి(Country Made Gun)తో భార్య(Wife)పై కాల్పులు(Firing)జ‌రిపాడు ఓ భర్త(Husband). పోలీసులు తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. భోజ్యాతండా(Bhojyatanda)పంచాయతీ పరిధిలోని పుల్లుడు తండాకు చెందిన లావుడ్యా సామ(Sama), శాంతి(Shanthi) భార్యాభర్తలు. వీరికి ముగ్గురు అమ్మాయిలు(Girls), ఒక అబ్బాయి(Boy) సంతానం. గత రాత్రి భార్యతో గొడవ పడిన సామ.. అట‌వీ జంతువులను వేటాడేందుకు ఉపయోగించే నాటుతుపాకితో ఆమెపై కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు(Police) వెంట‌నే ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడివున్న శాంతిని కొత్తగూడెం(Kothagudem) ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్ర‌స్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కేసు(Case) నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న సామ కోసం గాలిస్తున్నారు.

Updated On 15 Jun 2023 10:31 PM GMT
Yagnik

Yagnik

Next Story