భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న ఆవేదనతో కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువకుడి కేసులో ముగ్గురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న ఆవేదనతో కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువకుడి కేసులో ముగ్గురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన చల్లా దుర్గారావు (29) ఈ నెల 25న పెరవలి లాకుల వద్ద బైక్‌ను వదిలేసి కాల్వలోకి దూకి ఆత్మహత్య పాల్పడ్డాడు. ఈనెల 26వ తేదీన ఇరగవరం మండలం రాపాక వద్ద శవమై తేలిన విషయం తేలాడు. మృతుడు రాసిన ఆత్మహత్య లేఖ ప్రకారం తన చావుకు ఖండవల్లి గ్రామానికి చెందిన మోత్రపు అమోఘ్, మోత్రపు శివ ప్రసాద్, మృతుడి భార్య చల్లా దివ్య కుమారి కారణమని అందులో పేర్కొన్నాడు. ఫిర్యాదుదారు చల్లా వెంకట సుబ్బారావు ఇచ్చిన వివరాలు, గ్రామ పెద్దల సమాచారం, సాంకేతిక ఆధారాల మేరకు ముగ్గురిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచినట్టు తెలిపారు.

మృతుడు దుర్గారావు.. తన భార్య అదే గ్రామానికి చెందిన మోత్రపు అమోఘ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలు తెలిపాడు. దీంతో వీరంతా కలిసి అమోఘ్‌ను ఇంటికి వెళ్లి నిలదీశారు. దీంతో అతడితో పాటు తండ్రి శివప్రసాద్‌లు దుర్గారావును దుర్భాషలాడి అవమానించారు. తీవ్ర మనస్తాపం చెంది తన చావుకు వారు ముగ్గురే కారణమని సూసైడ్‌ నోట్‌ రాశారు. తాను దుబాయి వెళ్లి సంపాదించినదంతా దివ్యకుమారి ప్రియుడికి దోచిపెట్టిందని, దీంతో తాను ఆర్థికంగా చితికిపోయానని, వివాహేతర సంబంధంతో తీవ్ర మనస్తాపం చెందానని సూసైడ్‌ నోట్‌ రాసి కాల్వలోకి దూకాడు. నిందితులను రిమాండ్‌ నిమిత్తం తణుకు కోర్టులో శుక్రవారం హాజరు పరిచినట్టు పోలీసులు వెల్లడించారు.

ehatv

ehatv

Next Story