ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) దారుణం జరిగింది. ఓ పదేళ్ల బాలుడిని నరబలి ఇచ్చారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. మూఢనమ్మకాలతో బాలుడి దగ్గర బంధువే ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. బాలుడి గొంతు కోసం హత్య చేశాడు. బహ్రైచ్‌ (Bahraich)జిల్లా పర్సా గ్రామానికి చెందిన కృష్ణవర్మ అనే వ్యక్తికి పదేళ్ల వయసున్న వివేక్‌ వర్మ అనే కొడుకున్నాడు. అదే గ్రామంలో కృష్ణవర్మ బంధువు అనూప్‌ నివసిస్తున్ఆనడు.

ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) దారుణం జరిగింది. ఓ పదేళ్ల బాలుడిని నరబలి ఇచ్చారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. మూఢనమ్మకాలతో బాలుడి దగ్గర బంధువే ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. బాలుడి గొంతు కోసం హత్య చేశాడు. బహ్రైచ్‌ (Bahraich)జిల్లా పర్సా గ్రామానికి చెందిన కృష్ణవర్మ అనే వ్యక్తికి పదేళ్ల వయసున్న వివేక్‌ వర్మ అనే కొడుకున్నాడు. అదే గ్రామంలో కృష్ణవర్మ బంధువు అనూప్‌ నివసిస్తున్ఆనడు. అనూప్‌కు రెండున్నరేళ్ల వయసున్న కుమారుడున్నాడు. అతడికి మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదు. వైద్యం చేయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అనూప్‌ ఓ తాంత్రికుడిని సంప్రదించాడు. నరబలి ఇస్తే కొడుకు అనారోగ్యం నుంచి బయటపడతాడని ఆ తాంత్రికుడు (Human sacrificeccultist) చెప్పాడు. వాడి మాటలు నమ్మిన అనూప్‌ తన మేనమామ చింతారామ్‌తో కలిసి వివేక్‌వర్మ(vivek verma)ను ఎత్తుకెళ్లాడు. ఓ నిర్మానుష్య ప్రాంతానికి అతడిని తీసుకెళ్లి గొంతుకోసి హత్య చేశాడు. వివేక్‌ కనిపించకుండా పోవడంతో తండ్రి కృష్ణవర్మ పోలీసులకు కంప్లయింట్‌ చేశాడు. వెంటనే పోలీసులు బాలుడి కోసం వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇంటికి సమీపంలో ఉన్న పొలాల్లో వివేక్‌వర్మ మృతదేహం లభించింది. పోలీసులు హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. దర్యాప్తులో మంత్రగాడి మాటలు నమ్మి అనూప్‌ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తేలింది. అనూప్‌తో పాటు అతడికి సహకరించిన చింతారామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రగాడికి కూడా బేడిలు వేసి జైల్లో తోశారు పోలీసులు.

Updated On 27 March 2023 2:59 AM GMT
Ehatv

Ehatv

Next Story