సుమంత్‌ బాపట్ల పెయింటర్స్‌ కాలనీకి చెందిన వినోద్‌, సుష్మాంజలిల కుమారుడు

బాపట్ల సూర్యలంక రోడ్డులో యువకుడి దారుణ హత్య జరిగింది. పాతకక్షలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈసంఘటనలో గోరంట్ల సుమంత్‌(24) అక్కడిక్కడే మృతి చెందగా మరో యువకుడికి స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. స్థానికుల కథనం ప్రకారం బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్డులోని ఓ రెస్టారెంట్‌ వద్ద సాయంత్రం సుమారు 6.30గంటల సమయంలో ఐదుగురు యువకులు రెస్టారెంట్‌లో టిఫిన్‌ చేసేందుకు రెండు కార్లలో వచ్చారు. ఐదుగురూ మద్యం సేవించి ఉన్నారు. ఈ ఐదుగురు టిఫిన్‌ చేసేలోపే.. కొంతమంది యువకులు ఆటోలో, మరికొంతమంది ద్విచక్రవాహనాల్లో వచ్చి కారు అద్దాలు పగలగొట్టారు. 15మందికిపైగా దాడి చేశారు. కారులో వచ్చిన యువకులు ఎక్కడా అంటూ భీభత్సం సృష్టించారు. చీలురోడ్డు వద్ద మాపై దాడి చేసి ఇక్కడికి వచ్చారంటూ కొందరు, మాదగ్గర నగదు తీసుకున్నారంటూ మరికొందరు చెప్పి రెస్టారెంట్‌లోకి ప్రవేశించారు. అక్కడే ఉన్న మరోవ్యక్తి టిఫిన్‌ చేసే వారికి సమాచారం ఇవ్వగా ముగ్గురు వ్యక్తులు ఒకవైపునకు పరారు కాగా ఇద్దరు మాత్రమే వారి కంటపడ్డారు. వెంటనే కత్తులు, కర్రలతో దాడి చేయగా గోరంట్ల సుమంత్‌ అక్కడిక్కడే మృతిచెందగా, మరో యువకుడు అక్కడ నుంచి తప్పించుకుని పరారయ్యాడు.

సుమంత్‌ బాపట్ల పెయింటర్స్‌ కాలనీకి చెందిన వినోద్‌, సుష్మాంజలిల కుమారుడు. బీటెక్‌ వరకు చదువుకున్న సుమంత్‌ హైదరాబాద్‌లో ఒక ప్రైవేటు కంపెనీలో జాబ్‌ చేస్తున్నాడు. మంగళవారం ఉదయమే హైదరాబాద్‌ నుంచి బాపట్లకు వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే సుమంత్ మీద కూడా పలువురు పలు రకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు.

Updated On 6 Feb 2024 10:37 PM GMT
Yagnik

Yagnik

Next Story