ఖమ్మంలో జిల్లా కామేపల్లి మండ‌లం రుక్కితండాలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ కారు ఎక్కి డోర్ లాక్ కావడంతో ఊపిరి అందక బానోత్ పార్దు అనే నాలుగేళ్ల‌ బాలుడు మరణించాడు.

ఖమ్మంలో జిల్లా కామేపల్లి మండ‌లం రుక్కితండాలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ కారు ఎక్కి డోర్ లాక్ కావడంతో ఊపిరి అందక బానోత్ పార్దు అనే నాలుగేళ్ల‌ బాలుడు మరణించాడు. బానోతు అశోక్‌, అనూష దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు పార్థునాయక్‌(4), చిన్నకొడుకు వర్షిత్‌. దంపతులు రోజులాగే కుమారులను శుక్రవారం అంగన్‌వాడీ కేంద్రంలో విడిచి వెళ్లారు. మధ్యాహ్నం దాటిన తర్వాత అంగన్‌వాడీ ఆయా పార్థునాయక్‌, వర్షిత్‌ను అశోక్‌ సోదరికి అప్పగించి వెళ్లింది.

కొద్దిసేపటికి వర్షిత్‌ ఇంట్లో నిద్రపోయాడు. పార్థు ఆడుకుంటూ బయటకు వెళ్లి ఇంటి ఎదుట పార్క్‌చేసి ఉంచిన కారు డోర్‌ తీసుకొని లోపలికి వెళ్లాడు. డోర్‌ లాక్‌ కావడంతో బాలుడు లోపలే ఉండిపోయాడు. ఊపిరి ఆడక అచేతనంగా కారులోనే పడిఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత అశోక్‌ సోదరి పార్థు కోసం వెతికింది. కారులో పార్థు ఉన్నట్టు గుర్తించి, గ్రామస్థుల సాయంతో కారు అద్దాలు ప‌గ‌ల‌కొట్టి.. బాలుడిని స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా.. అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు.

Updated On 25 Aug 2023 9:55 PM GMT
Yagnik

Yagnik

Next Story