ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో దారుణం చోటు చేసుకుంది. ఇంజినీరింగ్ చ‌దువుతున్న

ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో దారుణం చోటు చేసుకుంది. ఇంజినీరింగ్ చ‌దువుతున్న కుర్రి రేఖ అనే విద్యార్థిని ఆదివారం రాత్రి వ‌స‌తి భ‌వ‌నంపై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ప్ర‌కాశం జిల్లా కంభం మండ‌లం జంగంగుట్ల గ్రామానికి చెందిన రేఖ ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో మెకానిక‌ల్‌ ఇంజినీరింగ్ చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుతోంది. ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల చాలా మంది షాక్ అవుతూ ఉన్నారు.

ఆదివారం రాత్రి 7.30 గంట‌ల స‌మ‌యంలో ఆమె వ‌స‌తి భ‌వ‌నంపై నుంచి దూకేసింది. తీవ్రంగా గాయ‌ప‌డిన ఆమెను తోటి విద్యార్థులు, అక్క‌డి సిబ్బంది ప్రాథ‌మిక చికిత్స కోసం ట్రిపుల్ఐటీలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డి నుంచి మెరుగైన వైద్యం కోసం క‌డ‌ప స‌ర్వ‌జ‌న ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డ చికిత్స పొందుతూ రాత్రి 10.30గంట‌ల ప్రాంతంలో రేఖ మృతి చెందింది. మ‌రో 10 రోజుల్లో ఇంటికి వెళ్లాల్సిన ఉండ‌గా ఆమె ఆత్మహత్య చేసుకోడానికి కారణం ఏమిటనే విషయం తెలియాల్సి ఉంది. ఈ విష‌యం తెలుసుకున్న ట్రిపుల్ఐటీ డైరెక్ట‌ర్ కుమార‌స్వామిగుప్త‌, హాస్ట‌ల్ సంక్షేమ అధికారి ఇమ్రాన్ ష‌రీఫ్ విద్యార్థిని మృత‌దేహాన్ని ప‌రిశీలించారు. మృతురాలు రేఖ మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Updated On 15 April 2024 12:42 AM GMT
Yagnik

Yagnik

Next Story