ఓ అమ్మాయి గదిని అద్దెకు తీసుకుంది. అయితే ఆ ఇంటి ఓనర్ కొడుకు నీచమైన పనికి తెగబడ్డాడు. బాత్రూమ్, పడకగదిలో స్పై కెమెరాను అమర్చాడు.

ఓ అమ్మాయి గదిని అద్దెకు తీసుకుంది. అయితే ఆ ఇంటి ఓనర్ కొడుకు నీచమైన పనికి తెగబడ్డాడు. బాత్రూమ్, పడకగదిలో స్పై కెమెరాను అమర్చాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన దేశ రాజధానిలో చోటు చేసుకుంది. కరణ్‌ అనే వ్యక్తి బాత్రూమ్, బెడ్‌రూమ్‌లోరహస్య స్పై కెమెరాలను అమర్చాడు.

ఈస్ట్ డిస్ట్రిక్ట్, ఢిల్లీ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ అపూర్వ గుప్తా మాట్లాడుతూ, దర్యాప్తులో, కరణ్ వద్ద నుండి ఒక స్పై కెమెరా, రికార్డ్ చేసిన వీడియోలను, వాటిని స్టోర్ చేయడానికి ఉపయోగించే రెండు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సివిల్ సర్వీసెస్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతూ ఉంది బాధితురాలు. నివాసం ఉంటున్న ఇంటి యజమాని కొడుకు కరణ్ ఈ పాడు పని చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని తన స్వగ్రామానికి యువతి వెళ్లిన సమయంలో అతని వద్ద తాళాలు వదిలి వెళ్ళింది. ఆ సమయంలో ఇంట్లోకి చొరబడిన కరణ్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు.

ఆ మహిళ తన వాట్సాప్ ఖాతాలో ఇటీవల కొన్ని అసాధారణ కార్యకలాపాలను గమనించింది. తన వాట్సాప్ ఖాతాకు లింక్ చేసిన పరికరాలను తనిఖీ చేసిన తర్వాత, జాబితాలో తనకు తెలియని ల్యాప్‌టాప్ కనిపించగా ఆమె త్వరగా లాగ్ అవుట్ అయింది. ఈ సంఘటన తర్వాత, మహిళ తనను ఎవరో దగ్గరగా ఫాలో అవుతున్నారు, తన పనులను చూస్తూ ఉన్నారని అనుమానించింది. ఆపై ఆమె తన అపార్ట్‌మెంట్‌లో నిఘా పరికరాల కోసం వెతకడం ప్రారంభించిందని పోలీసులు తెలిపారు. ఆ మహిళ తన బాత్‌రూమ్‌లోని బల్బ్ హోల్డర్‌లో ఒక కెమెరాను అమర్చినట్లు గుర్తించింది. వెంటనే పోలీసులను అప్రమత్తం చేసిందని పోలీసులు తెలిపారు. తన గదిని మరెవరైనా యాక్సెస్ చేశారా అని అడిగినప్పుడు, తాను ప్రయాణించేటప్పుడు కరణ్‌ దగ్గర తాళాలను వదిలివేసినట్లు మహిళ పోలీసులకు చెప్పింది. విచారణలో పోలీసులు కరణ్ నుండి నిజాలను బయటకు లాగారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story