పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మూసి ఉన్న ఫ్లాట్‌లోకి ప్రవేశించారు

ఇద్దరు తోబుట్టువులు తొమ్మిదేళ్ల బాలిక.. 15 ఏళ్ల సోదరుడు శనివారం న్యూఢిల్లీలోని వారి ఇంట్లో శవమై కనిపించారు. పిల్లలను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొని పరారీలో ఉన్న వారి తండ్రి కూడా రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించాడు. చిన్నారుల తల్లి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తూర్పు ఢిల్లీలోని శశి గార్డెన్‌లోని ఓ ఇంటికి శుక్రవారం నుంచి తాళం వేసి ఉందని, ఆ ఇంటి యజమాని శ్యామ్‌జీ కనిపించడం లేదని పోలీసులకు కాల్ వచ్చింది.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మూసి ఉన్న ఫ్లాట్‌లోకి ప్రవేశించారు. ఒక గదిలో పిల్లల మృతదేహాలను స్వాధీనం చేసుకోగా, మరొక గదిలో ఓ మహిళ అపస్మారక స్థితిలో కనిపించింది. ఆ మహిళకు అనేక గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మయూర్ విహార్‌లో టీ స్టాల్ నడుపుతున్న శ్యామ్‌జీ తన పిల్లలను గొంతుకోసి చంపి, అతని భార్యపై విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయాడని పోలీసు అధికారులు తెలిపారు. విచారణ కొనసాగుతుండగా, ఆనంద్ విహార్ సమీపంలోని రైలు పట్టాలపై శ్యామ్‌జీ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. హత్య కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.

Updated On 21 April 2024 12:06 AM GMT
Yagnik

Yagnik

Next Story