ధూల్‌పేటలో గంజాయి విక్రయిస్తున్న జంటను స్టేట్ టాస్క్ ఫోర్స్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ సోమవారం అరెస్టు చేసింది

ధూల్‌పేటలో గంజాయి విక్రయిస్తున్న జంటను స్టేట్ టాస్క్ ఫోర్స్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ సోమవారం అరెస్టు చేసింది. జంట నుంచి 2.165 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు కింది ధూల్‌పేట వద్ద నిఘా ఉంచిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. వినియోగదారులకు గంజాయిని విక్రయిస్తున్న మహేందర్ సింగ్, అతని భార్య సునీతా బాయిని పట్టుకున్నారు. ఈ కేసులో ప్రమేయమున్న మరో ముగ్గురు దుర్గేష్ సింగ్, అంగూరి బాయి, పాపాలాల్ సింగ్ పరారీలో ఉన్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్ అంజి రెడ్డి ఆధ్వర్యంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ తెలంగాణ 'ఆపరేషన్ ధూల్‌పేట్'లో భాగంగా గంజాయి వ్యాపారులపై సేకరించిన ఇన్‌పుట్‌ల మేరకు అరెస్టు చేశారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story