దాడి చేసిన మహిళ ముఖర్జీ నగర్‌లోని లైబ్రరీలో చదువుకోవడానికి వచ్చేది

ఎగతాళి చేస్తోందని అమ్మాయి పై కత్తితో దాడి చేసిన ఘటన దేశ రాజధానిలో చోటు చేసుకుంది. ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లో ఓ వ్యక్తి అమ్మాయిపై పదే పదే కత్తితో దాడి చేసిన ఘటన సీసీటీవీ ఫుటేజీలో వైరల్‌గా మారింది. మహిళకు స్వల్ప గాయాలైనప్పటికీ, ఆమె ప్రాణాపాయం నుండి బయటపడింది. నిందితుడిని అమన్‌గా గుర్తించిన పోలీసులు.. అరెస్టు చేశారు. మార్చి 22న ఈ ఘటన జరిగింది.

ముఖర్జీ నగర్‌లోని విద్యార్థులు అమన్ ను ఎగతాళి చేశారు. అతన్ని "పిచ్చివాడు" అని పిలిచేవారు. ఆ ప్రాంతంలో ఉండే అతను ఏమీ చేయకుండా ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటాడు. దాడి చేసిన మహిళ ముఖర్జీ నగర్‌లోని లైబ్రరీలో చదువుకోవడానికి వచ్చేది. ఆమె తనను కూడా ఎగతాళి చేసిందని, దీంతో సమీపంలోని కూరగాయల వ్యాపారి నుంచి కత్తి తీసుకుని ఆమెపై దాడికి పాల్పడ్డాడని నిందితుడు పోలీసులకు చెప్పాడు. బాటసారులు అడ్డుకోవడంతో మహిళకు పెద్దగా గాయాలు కాలేదు. CCTV ఫుటేజీలో.. అమన్ మహిళ వైపు పరిగెత్తడం, ఆమెను నేలపైకి నెట్టడం చూడవచ్చు.

Updated On 23 March 2024 10:53 PM GMT
Yagnik

Yagnik

Next Story