విశాఖ నగరంలో దారుణ హత్య జ‌రిగింది. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో జ‌రిగిన ఈ హ‌త్య స్థానికుల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసింది

విశాఖ నగరంలో దారుణ హత్య జ‌రిగింది. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో జ‌రిగిన ఈ హ‌త్య స్థానికుల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసింది. ఓ వ్య‌క్తి రెండు చేతులు, గొంతుపై దుండుగులు కత్తితో దాడి చేశారు. గాజువాక జగ్గూ జుంక్షన్ లో ఆ వ్య‌క్తిని దుండుగులు అతి కిరాతకంగా వెంటాడి వేటాడి చంపారు. భూ తగాదాల నేపథ్యంలో ఈ దారుణ హత్య జ‌రిగింద‌ని పోలీసులు భావిస్తున్నారు.

మృతుడిని వేమిరెడ్డి అప్పలనాయుడుగా గాజువాక పోలీసులు గుర్తించారు. అప్పలనాయుడు మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. హ‌త్య‌పై కేసు నమోదు చేసిన గాజువాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Eha Tv

Eha Tv

Next Story