భార్య నిద్రపోతున్న సమయం అమానుషంగా ప్రవర్తించి బలవంతపు శృంగారానికి పాల్పడేవాడు. శృంగారంలో సరిగా సహరించటం లేనందుకు భార్యకు డ్రగ్స్ ఇచ్చి ఆమెను అనుభవించేవాడు వజిరహ్మాద్ .

మనుషుల్లో పెరుగుతున్న పైశాచికత్వం రోజు రోజు కి శ్రుతి మించిపోతుంది . సమాజంలో ఆడవాళ్ళ మీద జరిగే అకృత్యాలు మితిమీరిపోతున్నాయి. తాజాగా బెంగుళూరు లో ఒక మహిళపైనా భర్త చేసిన అకృత్యం గురించి వింటే నివ్వెరపోతారు . బెంగళూరులోని దిన్నూరుకు చెందిన వజీర్ అహ్మద్ పైన అతని మొత్తం కుటుంబం పైన అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వజీర్ అహమ్మద్ 2020 లో ఒక మహిళను బలవంతపు వివాహం చేసుకున్నాడు. పెళ్ళైన దగ్గర నుండి భర్త అతని కుటుంబ సభ్యులు ఆమెను వరకట్నం కోసం వేధిస్తూ నానా చిత్రహింసలు పెడుతూవుండేవాళ్లు. అదనపు నగదు,నగలు తీసుకురమ్మని వేధించేవారు . భార్య నిద్రపోతున్న సమయం అమానుషంగా ప్రవర్తించి బలవంతపు శృంగారానికి పాల్పడేవాడు. శృంగారంలో సరిగా సహరించటం లేనందుకు భార్యకు డ్రగ్స్ ఇచ్చి ఆమెను అనుభవించేవాడు వజిరహ్మాద్ . ఇలా కొన్నాళ్లకు ఒక ఆడపిల్ల పుట్టింది. బిడ్డ పుట్టాక భార్యపై మోజు తీరిపోయింది . మళ్ళి ఆమెను చిత్రాహింసలకు గురిచేశాడు.

వజీర్ తల్లి తండ్రులు కూడా ఆమెను అనేక మార్లు అవమానాలకు గురిచేసేవారు. అదనపుడు కట్నం తీసుకురాకపోతే పాపాతో సహా బయటకు పోవాలంటూ ఆమెపై దాడి చేసి ఆమెను పాపను నడిరోడ్డుపైకి గెంటేశారు . బాధితురాలి తల్లి తండ్రులు ఆమెను హాస్పటిల్ లో చెరిపించి వైద్యం చేయించారు. ఒళ్ళు మండిన భార్య ఇక లాభం లేదని ఎదురు తిరిగింది . మొత్తం వజీర్ కుటుంబం ,వజీర్ అహ్మద్ పైన వరకట్న వేధింపులు,దాడి యత్నం కేసులను నమోదు చేయించగా పోలీసులు రంగంలోకి దిగారు. దాంతో వజీర్ పరారుఅయ్యాడు . పోలీసులు అతనిని పట్టుకునే ప్రయత్నం లో ఉన్నారు .

Updated On 13 March 2023 3:45 AM GMT
Ehatv

Ehatv

Next Story