కారణాలేమిటో తెలియదు కానీ ఓ మహిళా వ్యాపారవేత్త, ఓ కంపెనీ సీఈవో తన నాలుగేళ్ల కుమారుడిని అతి దారుణంగా చంపేసింది. ఆపై ఎవరికీ అనుమానం కలగకుండా ఉండేందుకు ఆ చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో దాచిపెట్టి, గోవా నుంచి కర్ణాటక వరకు ట్యాక్సీలో ప్రయాణించింది. ఆ హంతకురాలు పేరు సుచనా సేత్‌(Suchana Seth)..

కారణాలేమిటో తెలియదు కానీ ఓ మహిళా వ్యాపారవేత్త, ఓ కంపెనీ సీఈవో తన నాలుగేళ్ల కుమారుడిని అతి దారుణంగా చంపేసింది. ఆపై ఎవరికీ అనుమానం కలగకుండా ఉండేందుకు ఆ చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో దాచిపెట్టి, గోవా నుంచి కర్ణాటక వరకు ట్యాక్సీలో ప్రయాణించింది. ఆ హంతకురాలు పేరు సుచనా సేత్‌(Suchana Seth).. బెంగళూరుకు చెందిన ఆమె ఓ స్టార్టప్‌ను స్థాపించి సీఈవోగా వ్యవహరిస్తోంది. పోయిన శనివారం ఆమె తన నాలుగేళ్ల కొడుకును తీసుకుని ఉత్తర గోవాలోని ఓ హోటల్‌కు వెళ్లింది. సోమవారం ఉదయం హోటల్‌ గదిని ఖాళీ చేసి ట్యాక్సీలో కర్ణాటకకు బయలుదేరింది. ఆమె వెళ్లిపోయిన తర్వాత గదిని శభ్రం చేయడానికి వెళ్లిన హోటల్‌ సిబ్బంది అక్కడ రక్తపు మరకలను గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. హోటల్‌లో దిగినప్పుడు కొడుకుతో కలిసి కనిపించిన సుచనా వెళ్లేటప్పుడు మాత్రం ఒంటరిగా కనిపించడం పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆమె వెళ్లిన ట్యాక్సీ డ్రైవర్‌కు ఫోన్‌ చేశారు. సుచనాతో మాట్లాడారు. తన కొడుకును ఫ్రెండ్‌ ఇంటిదగ్గర ఉంచానని చెబుతూ అడ్రస్‌ కూడా ఇచ్చింది సుచనా. అయితే ఆమె ఇచ్చిన ఫ్రెండ్‌ అడ్రస్‌ ఫేక్‌ అని తేలడంతో పోలీసులు వెంటనే కర్ణాటక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో ట్యాక్సీ డ్రైవర్‌తో మాట్లాడారు. ఆమెకు అనుమానం కలగకుండా దగ్గరలో ఉన్న పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లాలని చెప్పారు. చివరకు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో పోలీసులు సుచనా సేత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆమె బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. సుచనాను అరెస్టు చేశారు. కొడుకును ఎందుకు హత్య చేసిందో కారణాలు తెలియదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 9 Jan 2024 1:07 AM GMT
Ehatv

Ehatv

Next Story