తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో మహిళను దారుణంగా హత్య చేశారు

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో మహిళను దారుణంగా హత్య చేశారు. ఆ మహిళ అంగన్‌వాడీ టీచర్ గా గుర్తించారు. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో చోటుచేసుకుంది.కాటాపురం గ్రామానికి చెందిన సుజాత ఊళ్లో అంగన్‌వాడీ టీచర్‌ విధులు నిర్వర్తిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం విధులు పూర్తీ చేసిన ఆమె తన స్వగ్రామం ఏటూరు నాగారానికి పయనమైంది. అయితే ఆమె తన ఊరికి చేరుకోలేకపోయింది. కుటుంబ సభ్యుల్లో టెన్షన్ మొదలైంది. ఆమెను వెతకడం మొదలుపెట్టారు.

బుధవారం ఉదయం తాడ్వాయి సమీపంలో అటవీ ప్రాంతంలో కొందరు కూలీ పనుల కోసం వెళ్లగా అక్కడ సుజాత మృతదేహాం కనిపించింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుజాత మెడకు గట్టిగా స్కార్ఫ్‌తో చుట్టి ఉరేసి హతమార్చినట్లుగా గుర్తించారు. సుజాత ఒంటిపై ఉన్న బంగారం, సెల్‌ఫోన్‌ కూడా దుండగులు ఎత్తుకెళ్లారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితులను విచారిస్తున్నారు పోలీసులు.

Updated On 15 May 2024 2:29 AM GMT
Yagnik

Yagnik

Next Story