ఇది దిగ్భ్రాంతి కలిగించే వార్త! కాస్త భయాన్ని కూడా కలిగించే వార్త! ఓ వ్యక్తి పదేళ్లుగా సుమారు 300 మంది రోగులను హత్య చేశాడు. పైగా తాను ఇంతమందిని చంపానని ఆ వ్యక్తి స్వయంగా చెప్పిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. విషయం తెలిసి పోలీసులు కూడా నివ్వెరపోయారు. నిందితుడిని అరెస్ట్‌ చేశారు. తమిళనాడుకు చెందిన నామక్కల్‌ జిల్లా పళ్లి పాలయానికి చెందిన 34 ఏళ్ల మోహన్‌రాజు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర రోజూ తచ్చాడుతుండేవాడు.

ఇది దిగ్భ్రాంతి కలిగించే వార్త! కాస్త భయాన్ని కూడా కలిగించే వార్త! ఓ వ్యక్తి పదేళ్లుగా సుమారు 300 మంది రోగులను హత్య చేశాడు. పైగా తాను ఇంతమందిని చంపానని ఆ వ్యక్తి స్వయంగా చెప్పిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. విషయం తెలిసి పోలీసులు కూడా నివ్వెరపోయారు. నిందితుడిని అరెస్ట్‌ చేశారు. తమిళనాడుకు చెందిన నామక్కల్‌ జిల్లా పళ్లి పాలయానికి చెందిన 34 ఏళ్ల మోహన్‌రాజు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర రోజూ తచ్చాడుతుండేవాడు. మార్చురీ దగ్గర పని చేస్తున్న వ్యక్తితో కలిసి చిన్నా చితక పనులు చేస్తుండేవాడు. ఈ నెల 18వ తేదీన సోషల్‌ మీడియాలలో అతడు చాలా మందిని చంపినట్టు మాట్లాడిన వీడియో చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. ముదిమి వయసులో ఉన్నవారిని, ఆరోగ్యం పూర్తిగా క్షీణించినవారిని, జీవచ్ఛవంలా బతుకుతున్నవారిని విషం ఇంజెక్షన్‌ ఇచ్చి చంపేవాడినని తెలిపారు. బంధువుల కోరిక మేరకే ఈ పని చేసేవాడినని వీడియోలో వివరించాడు. ఇలా చేసినందుకు అయిదు వేల రూపాయలు తీసుకునేవాడిని కూడా అన్నాడు. ఇప్పటి వరకు గత పదేళ్లలో ఇలా 300 మందిని చంపేశానని మోహన్‌రాజు చెప్పడం సంచలనం సృష్టించింది. ఇక్కడే కాదని, చెన్నై, బెంగళూరు నగరాలలో కూడా ఇలాంటి పనులకు వెళ్లానని అన్నాడు. అతడి వీడియో వైరల్‌ కావడంతో పళ్లిపాలయం పోలీసులు కేసు నమోదు చేశారు. మోహన్‌రాజ్‌ని అరెస్టు చేశారు. అబ్బే మద్యం మత్తులో అలా మాట్లాడాను తప్ప, అందులో నిజం లేదని దర్యాప్తులో మోహన్‌రాజు చెప్పాడు. పోలీసులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటి వరకు 18 మంది నకిలీ వైద్యులతో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు.

Updated On 21 April 2023 11:40 PM GMT
Ehatv

Ehatv

Next Story