జల్సాలకు అలవాటు పడ్డ భార్య భర్త టూర్స్ కు వెళ్లిన... ఆ సమయంలో బయటకు తిరుగుతుండటం ..భర్త వచ్చే సమయం ముందు తిరిగి ఇంటికి రావడం చేస్తుండేదట

పెద్దలు చేసిన పెళ్లే... పెళ్లయిన కొన్నాళ్లు హ్యాపీగానే ఎంజాయ్ చేశారు. ఇంతలో ఆ భార్యకు వాళ్ల కాపురంలో ఏ లోటు కనిపించిందో ఏమో కానీ... ఆ భార్య మాత్రం సరదాలకు, జల్సాలకు అలవాటు పడింది. ఇదే వాళ్ల కాపురంలో చిచ్చు పెట్టింది.. చివరకు భర్త చేతిలో హతమైంది.

మహారాష్ట్రలోని పాల్గార్ జిల్లాలోని నలసోపరా ప్రాంతంలో ప్రభు విశ్వకర్మ అలియాస్ ప్రభు (26) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ప్రభు ప్రైవేట్ ఉద్యోగి. ఏడేళ్ల క్రితం అనితా అనే యువతితో పెద్దలు వివాహం కుదిర్చారు. వివాహం అయ్యాకా ప్రభు, అనితా ఇద్దరు సంతోషంగానే కాపురం చేశారు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ప్రభు ఉద్యోగరిత్యా ఎక్కువగా టూర్స్ వెళ్తుండేవాడు. దీంతో బయట జల్సాలకు అలవాటు పడ్డ భార్య భర్త టూర్స్ కు వెళ్లిన... ఆ సమయంలో బయటకు తిరుగుతుండటం ..భర్త వచ్చే సమయం ముందు తిరిగి ఇంటికి రావడం చేస్తుండేదట.. అయితే తన భార్య బయటకు వెళ్లి వస్తుందన్న విషయం తెలుసుకున్న ప్రభు భార్యపై అనుమానం పెంచుకున్నాడు . దీంతో ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. వారిద్దరి మధ్య గొడవలు తీవ్రస్థాయికి చేరుకున్న అనితా లో ఏమాత్రం మార్పు రాలేదు. దీంతో విసిగి పోయిన ప్రభు భార్యను గొంతు నులిమి హత్య చేసాడు

అయితే హత్య జరిగిన రాత్రి భార్య శవం పక్కనే ఉన్న ప్రభు ....ఉదయం ప్రెష్ అప్ అయ్యి ఎప్పటిలాగే ఆఫీస్ కు వెళ్లాడు . ఆఫీస్ అనంతరం ప్రభు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి నా భార్య అనితాను హత్య చేసాను అంటూ చెప్పాడు..అంతేకాదు నా భార్యను రాత్రి చంపేశాను ... ఇంట్లో శవం ఉందని, మీరే వెళ్లి శవం తెచ్చుకోవాలంటూ పోలీసులకు చెప్పడంతో పోలీసులు బిత్తరపోవడం వాళ్ల వంతు అయ్యిందట .

Updated On 14 March 2023 5:33 AM GMT
Ehatv

Ehatv

Next Story