ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. మేము సమీపంలోని బస్టాండ్ వద్ద ఉన్నాము, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా

ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలోని బారాబతి సమీపంలోని జాతీయ రహదారి-16పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఫ్లైఓవర్‌పై నుంచి కిందకు పడటంతో ఐదుగురు మరణించారు. 38 మంది గాయపడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బస్సు కటక్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారి సంఖ్యను జాజ్‌పూర్ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ధృవీకరించారు. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. క్షతగాత్రులను కటక్‌లోని ఎస్‌సిబి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి, జాజ్‌పూర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు పంపినట్లు ఆయన తెలిపారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండొచ్చని అనుమానిస్తూ ఉన్నారు.

ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. మేము సమీపంలోని బస్టాండ్ వద్ద ఉన్నాము, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును నడుపుతున్నట్లు మాకు అనిపించింది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని మేము భావిస్తున్నామని స్థానికులు చెప్పారు. ప్రమాద స్థలంలో అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ ఘటన పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Updated On 15 April 2024 8:54 PM GMT
Yagnik

Yagnik

Next Story