ఆరుగురు మొబైల్ ఫోన్ దొంగలతో పాటు ముగ్గురు పోలీసులను పంజాగుట్ట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

ఆరుగురు మొబైల్ ఫోన్ దొంగలతో పాటు ముగ్గురు పోలీసులను పంజాగుట్ట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసులు గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సోమన్న, హోంగార్డు అశోక్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు చెందిన‌ సాయి రామ్‌తో పాటు జార్ఖండ్‌కు చెందిన మొబైల్ ఫోన్ దొంగల ముఠాను అరెస్టు చేశారు. దొంగ‌ల పట్టుబడినప్పుడల్లా బెయిల్ ఇవ్వడం ద్వారా పోలీసులు వారికి సహాయం చేస్తున్నారని విచార‌ణ‌లో తేలింది.

జార్ఖండ్‌లోని తీన్‌పహార్ గ్రామానికి చెందిన రాహుల్ కుమార్ యాదవ్ ఈ ముఠాకు ప్రధాన కింగ్‌పిన్ అని హైదరాబాద్ పోలీస్ వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) ఎస్ ఎం విజయ్ కుమార్ తెలిపారు. అతను ఒక ముఠాను ఏర్పాటుచేసి.. హైదరాబాద్, సూరత్, లక్నో, రాంచీ, బేలూర్, చెన్నై, వారణాసి, నాగ్‌పూర్, పాట్నా వంటి వివిధ ప్రాంతాలకు పంపించాడు.

ఆ ముఠా సభ్యులు కూరగాయల మార్కెట్లు, మెట్రో రైళ్లు, ఊరేగింపులు మొదలైన రద్దీ ప్రదేశాలను గుర్తించి దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డ‌తార‌ని డీసీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. 50-60 మొబైల్ ఫోన్లను దొంగిలించిన తర్వాత వారు ముఠా కింగ్‌పిన్ రాహుల్ కుమార్ యాదవ్‌కు సమాచారం అందిస్తారు.అతడు దొంగ‌లించిన‌ మొబైల్‌లను సేకరించడానికి మరొక వ్యక్తి ముఖ్తార్ సింగ్‌ను హైదరాబాద్.. ఇతర నగరాలకు పంపుతాడు. ముఖ్తార్ సింగ్ వాటిని జార్ఖండ్‌కు తీసుకువచ్చి ఇద్దరూ కలిసి పశ్చిమ బెంగాల్‌కు వెళ్లి భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలోని బంగ్లాదేశ్ పౌరులకు విక్రయిస్తారని డీసీపీ తెలిపారు. ముఠాలోని మరో నలుగురు పరారీలో ఉన్నారని.. వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. పోలీసులు పట్టుకున్నప్పుడు ముఠా సభ్యుల నుండి డబ్బు తీసుకొని వారిని పోలీసు స్టేషన్ల నుండి విడుదల చేయడానికి అరెస్టైన‌ పోలీసు సిబ్బంది ముఠా సభ్యులకు సహాయం చేశార‌ని అని డిసిపి చెప్పారు.

Eha Tv

Eha Tv

Next Story