మధ్యప్రదేశ్ లో ఓ పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తాపడటంతో

మధ్యప్రదేశ్ లో ఓ పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తాపడటంతో 13 మంది మృతిచెందగా మరో 25 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో 13 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని రాజ్ గర్ జిల్లా కలెక్టర్ తెలిపారు. మెరుగైన చికిత్స కోసం కొందరిని భోపాల్ తరలించామని తెలిపారు. త్రీవ గాయాలైన వారు ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపారు. రాజస్థాన్ నుంచి పెళ్లి బృందం వచ్చిందని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

రాజ్‌గఢ్ జిల్లాలోని పిప్లోధిజాద్‌లో ఆదివారం అర్థరాత్రి ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడిన ఘటనలో నలుగురు చిన్నారులతో సహా 13 మంది మరణించగా, 15 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో 13 మందిని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. ఇద్దరి తల, ఛాతీకి గాయాలవ్వడంతో అధునాతన సంరక్షణ కోసం భోపాల్‌కు తరలించామని , రాజ్‌గఢ్ కలెక్టర్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని తెలిపారు. బాధితులు రాజస్థాన్ నుండి పెళ్లి కోసం వచ్చిన వాళ్లేనని తెలిపారు.

Updated On 2 Jun 2024 8:21 PM GMT
Yagnik

Yagnik

Next Story