వారంలోని రెండో ట్రేడింగ్ రోజు కూడా భారత స్టాక్ మార్కెట్Indian stock market గ్రీన్ మార్క్‌లో ముగిసింది. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ ఈ సెన్సెక్స్ (sensex)75 పాయింట్ల జంప్ తో 60,130 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్National Stock Exchange' నిఫ్టీ (Nifty)26 పాయింట్ల స్వల్ప లాభంతో 17,769 పాయింట్ల వద్ద ముగిశాయి. డే ట్రేడింగ్‌లో మార్కెట్ పరిమిత శ్రేణిలో ట్రేడయింది .

వారంలోని రెండో ట్రేడింగ్ రోజు కూడా భారత స్టాక్ మార్కెట్Indian stock market గ్రీన్ మార్క్‌లో ముగిసింది. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ ఈ సెన్సెక్స్ (sensex)75 పాయింట్ల జంప్ తో 60,130 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్National Stock Exchange' నిఫ్టీ (Nifty)26 పాయింట్ల స్వల్ప లాభంతో 17,769 పాయింట్ల వద్ద ముగిశాయి. డే ట్రేడింగ్‌లో మార్కెట్ పరిమిత శ్రేణిలో ట్రేడయింది .

నేటి ట్రేడింగ్‌లో(trading) బ్యాంకింగ్, ఆటో, ఎఫ్‌ఎంసిజి, మెటల్స్, ఎనర్జీ, ఇన్‌ఫ్రా , ఆయిల్ & గ్యాస్ రంగాల షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్, మీడియా, ఐటీ రంగ షేర్లలో అమ్మకాలు కనిపించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ రెడ్ మార్క్‌లో ముగియగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ గ్రీన్ మార్క్‌లో ముగిసింది. సెన్సెక్స్‌లోని(Sensex) 30 షేర్లలో 18 లాభాల్లో, 12 నష్టాలతో ముగిశాయి. కాగా, నిఫ్టీలోని(Nifty) 50 స్టాక్స్‌లో 32 స్టాక్స్ లాభాలతో ,18 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి.

లాభపడ్డ స్టాక్స్
నేటి ట్రేడింగ్‌లో బజాజ్ ఫైనాన్స్ 2.38 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.03 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 1.76 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 1.60 శాతం, ఎస్‌బిఐ 1.28 శాతం, ఐసిఐసిఐ బ్యాంక్ 0.93 శాతం, లార్సెన్ 0.80 శాతం రిలైన్స్ 0.86 శాతం లాభంతో ముగిశాయి.

నష్టపోయిన స్టాక్స్
పతనమైన స్టాక్స్‌ను పరిశీలిస్తే, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 1.47 శాతం, హెచ్‌డిఎఫ్‌సి 1.15 శాతం, టెక్ మహీంద్రా 0.90 శాతం, సన్ ఫార్మా 0.67 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.51 శాతం చొప్పున నష్టపోయాయి.

Updated On 25 April 2023 5:58 AM GMT
rj sanju

rj sanju

Next Story