ఈ రాశివారికి ఇది శుభకాలం !

తేదీ:- 21, అక్టోబర్ 2024

సంవత్సరం:- శ్రీ క్రోధి నామ

అయనం:- దక్షిణాయణం

ఋతువు:- శరదృతువు

మాసం:- ఆశ్వయుజ

పక్షం:- బహళ పక్షం

తిథి:- చవితి ఉ.8.46 వరకు

వారం:- సోమవారం (ఇందువాసరే)

నక్షత్రం:- రోహిణి మ.12.00 వరకు

యోగం:- వరీయాన్ సా.5.12 వరకు

కరణం:- బాలువ ఉ.8.56 వరకు తదుపరి కౌలువ రా.8.11 వరకు

వర్జ్యం:- ఉ.శే.వ.6.03 వరకు మరల సా.5.38 - 7.11 వరకు

దుర్ముహూర్తము:- మ.12.08 - 12.54 మరల 2.27 - 3.13 వరకు అమృతకాలం:- ఉ.9.08 - 10.40 మరల రా.2.57 - 4.30 వరకు

రాహుకాలం:- ఉ.7.30 - 9.00 వరకు

యమగండ/కేతుకాలం:- ఉ.10.30 - 12.00 వరకు

సూర్యరాశి:- తుల

చంద్రరాశి:- వృషభం

సూర్యోదయం:- 5.57

సూర్యాస్తమయం:- 5.33

మేషం(mesham)

ఈ రాశివారికి ఇది శుభకాలం. తమ తమ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్య పనులను మొదలుపెట్టడానికి ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. లక్ష్మీదేవి సందర్శనం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

వృషభం(Vrushabam)

ఈ రాశివారు తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవారాదన ఎట్టిపరిస్థితుల్లోనూ మానవద్దు.

మిథునం(Mithunam)

ఈ రాశివారికి తమ తమ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో మీరు మాటపడవలసి వస్తుంది. సహనం కోల్పోరాదు. నిదానంగా అన్ని సర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. లక్ష్మీ సహస్రనామ పారాయణం చేస్తే బాగుంటుంది.

కర్కాటకం(Karkatakam)

ఈ రాశివారికి వారి పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తుంది. మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది.

సింహం(Simham)

ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమం.

కన్య(Kanya)

ఈ రాశివారికి ఇది శుభ కాలం. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలుంటాయి. సకాలంలో సహాయం చేసేవారున్నారు. శివారాధన చేయడం మంచిది.

తుల(Thula)

ఈ రాశివారు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అవసరానికి తగిన సహకారం అందుకుంది. మనస్సౌఖ్యం ఉంది. శివుడిని ఆరాధిస్తే మంచిది.

వృశ్చికం(Vruchikam)

ఈ రాశివారికి వారి స్వధర్మం వారిని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం పఠించడం మంచిది.

ధనుస్సు(Dhanusu)

ఈ రాశివారికి శ్రమకు తగ్గ ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తిచేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించే వారున్నారు జాగ్రత్త. ఇష్టదైవనామాన్ని జపించాలి.

మకరం(Makaram)

ఈ రాశివారికి కీలక వ్యవహారాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. బంధుమిత్రుల వలన మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

కుంభం(Kumbam)

ఈ రాశివారు చేపట్టేపనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఆపదలు తొలగడానికై వేంకటేశ్వరుణ్ణి పూజించాలి.

మీనం(Meena)

ఈ రాశివారికి శ్రమకు తగిన ఫలితాలుంటాయి. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్య పనులను త్వరగా పూర్తయ్యేవిధంగా ప్రణాలికను సిద్ధం చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్యహృదయం పఠించడం మంచిది.

Eha Tv

Eha Tv

Next Story