బుధవారం-గురువారం మ‌ధ్య‌ అర్ధరాత్రి వేళ‌ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో శని చంద్రగ్రహణం కనిపించింది.

బుధవారం-గురువారం మ‌ధ్య‌ అర్ధరాత్రి వేళ‌ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో శని చంద్రగ్రహణం కనిపించింది. 18 ఏళ్ల తర్వాత ఈ అద్భుత దృశ్యం కనిపించింది. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ నుండి శని చంద్రగ్రహణంకు సంబంధించి చిత్రాలు వెలువడ్డాయి. శాస్త్రవేత్తలు ఈ ఖగోళ దృగ్విషయాన్ని లూనార్ అక్యుల్టేషన్ ఆఫ్ సాటర్న్ అని పిలుస్తారు. అంతకుముందు మార్చిలో చంద్రగ్రహణం కనిపించింది.

జూలై 24 అర్ధరాత్రి 1.30 గంటలకు శని చంద్రగ్రహణం ప్రారంభమైంది. 45 నిమిషాల తర్వాత అంటే మధ్యాహ్నం 2:25 గంటలకు చంద్రుని వెనుక నుంచి శనిగ్రహం కనిపించడం ప్రారంభించింది. శాస్త్రవేత్తల ప్రకారం.. చంద్రుడు శనిగ్రహాన్ని తన వెన‌క‌ దాచినప్పుడు.. శని చంద్రగ్రహణం సంభవిస్తుంది. శని చంద్రుని వెనుక దాక్కున్నందున శని వలయాలు చంద్రుని వైపు నుండి కనిపిస్తాయి. సాధారణంగా సూర్యగ్రహణం తర్వాత చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఇటువంటి అరుదైన ఖగోళ సంఘటనలు ఎన్నో సంవత్సరాలకు మాత్రమే కనిపిస్తాయి.

భారత్‌తో పాటు పొరుగు దేశాలైన శ్రీలంక, మయన్మార్, చైనాలలో కూడా శనిగ్రహ చంద్రగ్రహణం కనిపించింది. ఈ దేశాల్లో దాని సమయం భారతదేశానికి భిన్నంగా ఉంటుంది. శని చంద్రగ్రహణానికి కారణం ఏమిటంటే.. రెండు గ్రహాలు వేగంతో కదులుతున్నప్పుడు.. శని చంద్రుని వెనుక నుండి పైకి వచ్చినట్లు కనిపిస్తుంది. ఇందులో శని గ్రహ వలయాలు ముందుగా కనిపిస్తాయి.

Eha Tv

Eha Tv

Next Story