టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర రేపటితో ముగియనుంది. దీంతో యువగళం విజయోత్సవ సభను ఈ నెల 20న భోగాపురం మండలం పోలేపల్లి వద్ద భారీ ఎత్తున నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) చేపట్టిన యువగళం(Yuvagalam) పాదయాత్ర రేపటితో ముగియనుంది. దీంతో యువగళం విజయోత్సవ సభను ఈ నెల 20న భోగాపురం(Bhogapuram) మండలం పోలేపల్లి(Polepalli) వద్ద భారీ ఎత్తున నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభ ఏర్పాట్లను ఆదివారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యువగళం విజయోత్సవ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలి వస్తారని తెలిపారు.

స‌భ కోసం అద్దెకు బస్సులు ఇవ్వాలని ఆర్టీసీని కోరితే ఇప్పటివరకూ స్పందన లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో, టీడీపీ శ్రేణులు అందుబాటులో ఉన్న ఏ వాహనం దొరికినా దాంట్లో పోలేపల్లి వచ్చేయాలని పిలుపునిచ్చారు. డిసెంబరు 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు పోలేపల్లిలో సభ ప్రారంభవుతుందని తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలు సకాలంలో సభా ప్రాంగణానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల పోరాటానికి టీడీపీ(TDP)-జనసేన(Janasena) సిద్ధమని.. ఈ సభ ద్వారా సమర శంఖం పూరిస్తామని అన్నారు. యువగళం ముగింపు సభ ఏపీ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖిస్తుందని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

Updated On 17 Dec 2023 9:12 AM GMT
Yagnik

Yagnik

Next Story