తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ కు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న నేతలకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని.. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని, పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలని ఆమె ఆకాంక్షించారు. ఏపీకి రాజధాని నిర్మాణం జరగాలని కోరారు వైఎస్ షర్మిల.

ఏపీలో సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలని, ప్రజలు ఇచ్చిన మెజారిటీతో ముందుకు అడుగు వేయాలని షర్మిల సూచించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచన చేసి, ప్రత్యేక హోదా కోసం కట్టుబడాలని అన్నారు. అన్ని విభజన హామీలకు కేంద్రం కట్టుబడాలని అలా అయితేనే కేంద్రానికి మద్దతు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ, జనం గొంతుకగా మారిన కాంగ్రెస్ పార్టీ, ఇక మీదట కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుందని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కూడా సూచించారు.

Updated On 5 Jun 2024 3:18 AM GMT
Yagnik

Yagnik

Next Story