వైసీపీ సిద్ధం సభలకు వస్తున్న స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

వైసీపీ సిద్ధం సభలకు వస్తున్న స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీగా జనసమీకరణలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 3 సభలు సక్సెస్ అయ్యాయి. ఒకదానికి మించి మరో సిద్ధం సభ సక్సెస్ అయిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక నాలుగో, చివరి సభ అద్దంకిలో నిర్వహించనున్నారు. మార్చి 10వ తేదీన అద్దంకి వేదికగా ఆఖరి సిద్ధం సభ జరగనుంది. ఈ సభకు 15లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది.

వైసీపీ, భీమిలీ, దెందులూరు, రాప్తాడులో సిద్ధం సభలు నిర్వహించింది. నాలుగో సభకు మరింత ఎక్కువగా వస్తారనే అంచనా ఉంది. ఈ సభకు గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి ప్రజలను తరలిస్తారని తెలిసింది.

Updated On 9 March 2024 10:28 PM GMT
Yagnik

Yagnik

Next Story