ఏపీలో రాజకీయాలు(AP politics) గరంగరంగా నడుస్తున్నాయి.

ఏపీలో రాజకీయాలు(AP politics) గరంగరంగా నడుస్తున్నాయి. ఈరోజు 12 గంటలకు బ్లాస్టింగ్‌ న్యూస్‌ పెడుతున్నామని నిన్నటి నుంచి రెండు పార్టీలు సోషల్‌ మీడియా వేదికగా సవాళ్లు విసురుకున్నాయి. వైసీపీ(YCP), టీడీపీ(TDP) మధ్య ట్విట్ల యుద్ధం జరుగుతోంది. నిన్న ఆస్తులపై జగన్(YS Jagan) కు షర్మిల(YS sharmila) రాసిన లేఖను టీడీపీ బయటపెట్టింది. తాజాగా టీడీపీపై వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా అంటూ ట్వీట్‌ వేసింది. గత కొన్నేళ్లుగా 15 మంది వినియోగదారులతో డ్రగ్స్‌ వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్ ఛానల్ అధినేత అంటూ.. కావాలంటే ఇవే సాక్షాలు చూడండి అంటూ వైసీపీ పోస్ట్ చేసింది.

Eha Tv

Eha Tv

Next Story