వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అధికార ప్రతినిధి శ్యామల(Shyamala) ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) తీరును గట్టిగా విమర్శించారు

వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అధికార ప్రతినిధి శ్యామల(Shyamala) ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) తీరును గట్టిగా విమర్శించారు. నిజాలంటే చంద్రబాబుకు భయమని, ఆ నిజాలను పాతరవేయడానికి ఎంతకైనా దిగజారుతారని శ్యామల అన్నారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత టాటా(TATA) సంస్థ విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యిందని చంద్రబాబు చేసుకుంటున్న ప్రచారంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో టీసీఎస్‌ రాబోతున్నదని లోకేశ్‌(Lokesh) అలా ట్వీట్‌ చేశారో లేదో విశాఖలో టీసీఎస్‌ క్యాంపస్‌ కోసం వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) చేసిన ప్రయత్నాలు, 2022లో టాటా సన్స్‌ ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌తో జరిపిన చర్చలు, తదితర వివరాలను నెటిజన్లు బయటపెట్టారు. సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది అంటూ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు శ్యామల.

Eha Tv

Eha Tv

Next Story