వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎన్నో వర్గాలకు ఎంతో మంచి జరిగింది. ఆ మంచి గురించి

వైఎస్సార్‌సీపీ ఎన్నికలకు ముందు దూకుడును ప్రదర్శిస్తూ ఉంది. ఇప్పటికే సిద్ధం సభలతో క్యాడర్ ను అలర్ట్ చేసిన వైసీపీ.. ఇక ఎన్నికల ప్రచార అస్త్రాలను సిద్ధం చేసుకుంటూ ఉంది. ‘నా కల..’ అంటూ ఆయా వర్గాల పేరుతో ప్రచారానికి వైసీపీ శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ప్రజల కలలను, ఆకాంక్షలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ ముందుకు వెళుతోంది వైసీపీ ప్రభుత్వం.. అందుకే ఆ విషయాన్ని జనానికి తెలియజేసేలా.. సీఎం జగన్‌ పేరిట ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది వైఎస్సార్‌సీపీ. కార్మికుల కల - జగనన్న కల, విద్యార్థుల కల - జగనన్న కల, రైతుల కల- జగనన్న కల అంటూ పలు వర్గాలకు సంబంధించిన పేర్లతో పోస్టర్లు ఆకట్టుకుంటూ ఉన్నాయి.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎన్నో వర్గాలకు ఎంతో మంచి జరిగింది. ఆ మంచి గురించి జనం కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎన్నికలకు ముందు ఈ విషయాలను సామాన్య జనానికి చెప్పడమే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే సీఎం జగన్ కూడా జనంలోకి రానున్నారు.

Updated On 5 March 2024 11:01 PM GMT
Yagnik

Yagnik

Next Story