వైసీపీ నేతలు గవర్నర్ ను కలిశారు. రాజ్ భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ని

వైసీపీ నేతలు గవర్నర్ ను కలిశారు. రాజ్ భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ని మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ బృందం కలిసింది. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత వైఎస్సార్‌సీపీపై టీడీపీ నేతలు చేస్తున్న దాడులపై గవర్నర్ అబ్దుల్ నజీర్‌కి ఫిర్యాదు చేశారు. పోలీస్ అధికారులను ఈసీ మార్చిన చోటే హింసాత్మక సంఘటనలు ఎక్కువ చోటుచేసుకున్నాయని వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మంత్రి బొత్సతో పాటు గవర్నర్‌ని కలిసిన వారిలో మేరుగ నాగార్జున, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, మోపిదేవి వెంకట రమణ, కావలి మనోహర్ నాయుడు తదితరులు ఉన్నారు.

చంద్రబాబు ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు హింసకి దిగారని చంద్రబాబుతో పాటు ఘటనకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో హింస జరుగుతున్న ప్రాంతాల్లోని వారితో సీఎం జగన్ ఇప్పటికే మాట్లాడారు. సంయమనంతో ఉండాలని పార్టీ శ్రేణులకు వైసీపీ అధినేత జగన్ సూచించారు.

Updated On 16 May 2024 11:26 PM GMT
Yagnik

Yagnik

Next Story