పల్నాడు జిల్లాలో మేమంతా సిద్ధం యాత్రకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎంపీ ఆళ్ల అయోధ్య రామి రెడ్డి తెలిపారు.

పల్నాడు జిల్లాలో మేమంతా సిద్ధం యాత్రకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎంపీ ఆళ్ల అయోధ్య రామి రెడ్డి తెలిపారు. వినుకొండ నుంచి మేమంతా సిద్ధం సభ జిల్లాలో ప్రారంభమవుతుందని.. పిడుగురాళ్లలో మేమంతా సిద్ధం సభ జరుగుతుందని వెల్ల‌డించారు. జగన్మోహన్ రెడ్డి సభ కోసం కార్యకర్తలు నాయకులు ఎదురుచూస్తున్నారని అన్నారు.

పల్నాడులో మేమంతా సిద్ధం యాత్ర సభ చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో పలనాడు ప్రాంతం గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు,. అవ్వ తాతలకు వాలంటీర్ ద్వారా పెన్షన్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడని.. అవ్వ తాతలు పెన్షన్ కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. చంద్రబాబు చేసిన పని భూం రాంగ్ కావడంతో ఏదేదో మాట్లాడుతున్నాడని అన్నారు. చంద్రబాబు కూటమిని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

మేమంతా సిద్ధం సభ యాత్ర, సభ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారని అన్నారు. మరొక వారంలో పల్నాడు లో మేమంతా సిద్ధం కార్యక్రమం జరుగుతుందన్నారు.

Updated On 3 April 2024 7:28 AM GMT
Yagnik

Yagnik

Next Story