వైసీపీ(YCP)ని వీడుతున్నట్లు ఆ పార్టీ గన్నవరం నాయ‌కుడు యార్లగడ్డ వెంకట్రావు(Yarlagadda Venkatrao) ప్రకటించారు. టీడీపీ(TDP)లో చేరేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu) అపాయింట్‌మెంట్‌ కోరుతున్నానని తెలిపారు. గన్నవరం అభ్యర్థిగా తాను పనికొస్తానని భావిస్తే.. టికెట్‌ ఇవ్వాలని చంద్ర‌బాబును కోర‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

వైసీపీ(YCP)ని వీడుతున్నట్లు ఆ పార్టీ గన్నవరం నాయ‌కుడు యార్లగడ్డ వెంకట్రావు(Yarlagadda Venkatrao) ప్రకటించారు. టీడీపీ(TDP)లో చేరేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu) అపాయింట్‌మెంట్‌ కోరుతున్నానని తెలిపారు. గన్నవరం అభ్యర్థిగా తాను పనికొస్తానని భావిస్తే.. టికెట్‌ ఇవ్వాలని చంద్ర‌బాబును కోర‌నున్న‌ట్లు పేర్కొన్నారు. విజయవాడ(Vijayawada)లో తన అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. గ‌త కొంత‌కాలంగా యార్లగడ్డ పార్టీని వీడుతార‌నే ప్ర‌చారం గ‌ట్టిగా జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలో ఆయ‌న కొద్దిరోజులుగా అనుచ‌రుల‌తో భేటీ అవుతూ వ‌స్తున్నారు. సుదీర్ఘ భేటీల అనంత‌రం ఆయ‌న శుక్ర‌వరం పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Updated On 18 Aug 2023 5:59 AM GMT
Ehatv

Ehatv

Next Story