ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఈ నాయకులు ఆయా జిల్లాల్లో చాలా కీలకంగా వ్యవహరించనున్నారు

వైసీపీ అధిష్టానం పలువురు నేతలకు కీలక బాధ్యతలు అప్పగించింది. ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు జిల్లాల కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా మల్లాది విష్ణును నియమించారు. గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్‌గా విజయసాయిరెడ్డి బాధ్యతను అప్పగించారు. కర్నూలు, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్‌ కోఆర్డినేటర్‌గా పి.రామసుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. కడప, రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గాల కోఆర్డినేటర్‌గా కె.సురేష్‌బాబును నియమించారు. ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్‌గా గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ వైసీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఈ నాయకులు ఆయా జిల్లాల్లో చాలా కీలకంగా వ్యవహరించనున్నారు. ముఖ్యంగా అసంతృప్తులను పార్టీ దాటనివ్వకుండా.. కార్యకర్తలను ఆవేశపడనివ్వకుండా చేయాల్సి ఉంటుంది. ఇక పలు ప్రాంతాలలోకి వెళ్లి.. వైసీపీ చేసిన సంక్షేమాన్ని చెప్పాల్సిన బాధ్యత కూడా వీరిదే!

Updated On 10 Feb 2024 10:26 PM GMT
Yagnik

Yagnik

Next Story