APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. సీఎం జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎత్తిచూపుతూ..

APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. సీఎం జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎత్తిచూపుతూ.. ఇటీవ‌ల ఆమె నవ సందేహాలు పేరుతో లేఖ రాసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆమె అదే పేరుతో మరో లేఖ రాశారు. రాష్ట్రంలో ఉద్యోగాల విషయంలో తాము అడుగుతున్న నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

షర్మిలా రెడ్డి

1) ప్రభుత్వంలో వచ్చాక 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు.. ఏమయింది ?

2) జనవరి 1న ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అన్నారు.. ఎందుకు ఇవ్వలేదు ?

3) 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాం అన్నారు.. 22 ఎంపీలు ఇస్తే ఏం చేశారు ?

4) గ్రూప్-2 నోటిఫికేషన్ రెండు సార్లు ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు..ఎందుకు ?

5) విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు,అసిస్టెన్స్ ప్రొఫెసర్లు ఎందుకు భర్తీ చేయలేదు ?

6) 23 వేలతో మెగా డీఎస్సీ అని చెప్పి 6 వేలతో దగా డీఎస్సీ ఎందుకు వేశారు ?

7) రాష్ట్రంలో నిరుద్యోగులు 7.7శాతం పెరిగారు అంటే అది మీ వైఫల్యం కాదా ?

8) ఉద్యోగాలు లేక బిడ్డలు ఇతర రాష్ట్రాలకు వలసలు ఎందుకు పోతున్నారు ?

9) జాబు రావాలి అంటే బాబు పోవాలి అన్నారు.. ఇప్పుడు జాబు రావాలి అంటే మీ పాలన పోవాలి అంటే అంగీకరిస్తారా ?

Updated On 2 May 2024 12:52 AM GMT
Yagnik

Yagnik

Next Story