తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా తెలుగుదేశంపార్టీ(TDP), వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు(YCP) నీచ రాజకీయాలు చేస్తున్నాయని

తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా తెలుగుదేశంపార్టీ(TDP), వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు(YCP) నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల(YS Sharmila) విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు(Chandra Babu) చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భగం కలిగించేలా ఉన్నాయన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆమె ఓ పోస్ట్ పెట్టారు. ఎక్స్‌లో షర్మిల ఇంకా ఏమన్నారంటే 'కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయి. చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే.. సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశ్యమే మీకు లేకుంటే.. నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే..తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయండి. లేదా CBI తో విచారణ జరిపించండి. మహా పాపానికి,ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి. మీ వ్యాఖ్యలపై కట్టుబడి ఉండాలని, నిజాలు నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.

ehatv

ehatv

Next Story