సుబ్బారెడ్డి(Sybha reddy) జగన్‌(YS Jagan) మోచేతి నీళ్లు తాగే వ్యక్తి.

సుబ్బారెడ్డి(Sybha reddy) జగన్‌(YS Jagan) మోచేతి నీళ్లు తాగే వ్యక్తి. జగన్‌ పదవి ఇస్తే వాటిని అనుభవిస్తున్నారని షర్మిల(YS sharmila) అన్నారు. సుబ్బారెడ్డి, ఆయన కొడుకు ఆర్థికంగా కూడా గొప్పగా లాభపడ్డారు. సుబ్బారెడ్డి ఇలా కాకుండా ఎలా మాట్లాడుతారు. సుబ్బారెడ్డే కాదు రేపు సాయిరెడ్డి(Sai reddy) కూడా మాట్లాడుతారు. సాయిరెడ్డి కూడా జగన్‌ మోచేతి కిందే ఉన్నారు. సుబ్బారెడ్డి, సాయిరెడ్డి జగన్‌ వైపు ఉన్నారని తెలిసి కూడా లేఖలో వారి పేర్లను ప్రస్తావించానని షర్మిల అన్నారు. వీరికి నిజనిజాలన్నీ తెలుసు. వైఎస్‌ ఆశయాలు, వైఎస్ ఆలోచనలు వీరికి తెలుసు. వారి నిజస్వరూపం బయటపడాలనే సుబ్బారెడ్డి, సాయిరెడ్డి పేర్లు ప్రస్తావించా. మా అమ్మకు అన్ని విషయాలు తెలియాలనే వారి పేర్లు తీసుకున్నా. లేఖలో నేను రాసిన అంశాలన్నీ కరెక్టేనని ప్రమాణం చేస్తా. సుబ్బారెడ్డి చేస్తారా. నేను రాసిన లేఖ నిజమని నా బిడ్డలపై ప్రమాణం చేసి చెప్తున్నా. నాన్న బతికున్న రోజుల్లో కూడా నాపై ఇంకా ఆస్తులు ఎందుకు మారలేదని అడిగితే.. డోంట్‌ వరీ డాడ్‌.. షర్మిల మేలుకోరే వ్యక్తుల్లో నీ తర్వాత నేనే ఉంటానని నాన్నతో చెప్పారు. ఇది నిజమని నేను ప్రమాణం చేసి చెప్తున్నా. నిన్న సుబ్బారెడ్డి అన్న మాటలు నిజమని ప్రమాణం చేస్తారా. వారి పేర్లు పెట్టుకున్నారు, వాళ్లవే ఆస్తులని సుబ్బారెడ్డి అనడం విడ్డూరంగా ఉంది. పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఆస్తులన్నీ వారికే చెందాలని రూల్‌ ఉందా అని షర్మిల అన్నారు. ఆస్తులు నావైతే నేను కూడా జైలుకు వెళ్లాలని సుబ్బారెడ్డి అంటున్నారు.. మరి భారతి(YS bharathi) పేరుతో ఆస్తులున్నాయి.. భారతి జైలుకు వెళ్లలేదు కదా అని షర్మిల ప్రశ్నించారు.

Eha Tv

Eha Tv

Next Story