రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసి, వైద్య విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారా.? అని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి టీడీపీ నేతృత్వంలోని కూట‌మి స‌ర్కార్‌ను ప్ర‌శ్నించారు.

రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసి, వైద్య విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారా.? అని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి టీడీపీ నేతృత్వంలోని కూట‌మి స‌ర్కార్‌ను ప్ర‌శ్నించారు. ఇప్పటికే అందని ద్రాక్షలా మారిన వైద్య విద్యను.. పేద విద్యార్థులకు మరింత దూరం చేసే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా.? గుజరాత్ పీపీపీ విధానంపై ఎందుకు అధ్యయనం చేయాలని అనుకున్నారు.? జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి చంద్ర‌బాబు వెంటనే నోరు విప్పాలి.. ప్రైవేటీకరణపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కూటమి సర్కార్ లో భాగస్వామ్య పక్షంగా ఉండి.. ఈ ఏడాది 5 కొత్త కాలేజీలైన పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పాడేరుల్లో వసతులను కల్పించలేమని.. నిర్వహించడం సాధ్యపడదని.. అదనపు సీట్లు కూడా అవసరం లేదని.. మెడికల్ బోర్డుకు లేఖ రాయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ప్రభుత్వ రంగంలో అదనపు సీట్లు వస్తుంటే ఏ రాష్ట్రమైనా వద్ధనుకుంటుందా.? ఇది కూటమి సర్కారుకు సిగ్గుచేటు అని మండిప‌డ్డారు.

కొత్తగా 750 సీట్లు సమకూరకపోవడం మీ నిర్లక్ష్యం ఫలితమేన‌న్నారు. లక్షలు పోసి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న పిల్లల భవిష్యత్ ను అగమ్య గోచరంగా మార్చారు.. విద్యార్థుల ఆశలను నీరు గార్చారు.. మెడికల్ సీట్లకోసం పక్క రాష్ట్రాల బాట పట్టేలా చేస్తున్నారని అన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ విధానం పెట్టి YCP సర్కార్ మెడికల్ సీట్లను అమ్ముకుంటే.. ఆ విధానాన్ని రద్దు చేస్తామని మాట ఇచ్చిన కూటమి సర్కార్.. ఇప్పుడు అదే విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కొత్త మెడికల్ కాలేజీల్లో వసతులను కల్పించి.. ఈ ఏడాది నుంచే వాటిని ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story