వై.ఎస్‌.షర్మిల(YS sharmila) తన కుటుంబసభ్యులతో కలిసి నిన్న ఇడుపులపాయకు వెళ్లారు కదా! భర్త బ్రదర్‌ అనిల్‌కుమార్‌(anil Kumar), కొడుకు, కాబోయే కోడలితో కలిసి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి(YS Rajashekar Reddy) సమాధి దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనల్లో తల్లి విజయమ్మ కూడా పాల్గొన్నారు.

వై.ఎస్‌.షర్మిల(YS sharmila) తన కుటుంబసభ్యులతో కలిసి నిన్న ఇడుపులపాయకు వెళ్లారు కదా! భర్త బ్రదర్‌ అనిల్‌కుమార్‌(anil Kumar), కొడుకు, కాబోయే కోడలితో కలిసి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి(YS Rajashekar Reddy) సమాధి దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనల్లో తల్లి విజయమ్మ కూడా పాల్గొన్నారు. హైదరాబాద్‌ నుంచి నేరుగా ఇడుపులపాయకు(Idupulapaya) స్పెషల్ ఫ్లయిట్‌లో వెళ్లారు. ఆ స్పెషల్‌ ఫ్లయిట్‌ ఎవరిదో కాదు, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు(Ramesh) చెందిన రిత్విక్‌ గ్రీన్‌ పవర్‌ అండ్‌ ఏవియేషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌(Green Power PVT LTD) కంపెనీది! సీఎం రమేశ్‌ ఒకప్పుడు తెలుగుదేశంపార్టీలో ఉన్నారన్న విషయం, చంద్రబాబునాయుడుకు(Chandrababu) సన్నిహితులన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి త్వరలో షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో(YSRTP) చేరనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌పార్టీ బరువుబాధ్యతలను చేపట్టబోతున్నారు. అలాంటిది టీడీపీకి సన్నిహితంగా ఉంటూ బీజేపీలో ఉన్న సీఎం రమేశ్‌ ఫ్లయిట్‌లో ప్రయాణించడమేమిటి? అంటే రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టీడీపీతో లోపాయికారి ఒప్పందమేమైనా కుదుర్చుకోబోతున్నదా? ఏమో.. రాజకీయాలలో ఏదైనా సాధ్యం!

Updated On 3 Jan 2024 6:30 AM GMT
Ehatv

Ehatv

Next Story