బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం నితీష్ తీర్మానం చేసి మోదీ ముందు డిమాండ్ పెడితే ఏపీకి హోదాపై చంద్రబాబు కనీసం నోరు విప్పడం లేదని APCC చీఫ్ వైఎస్ ష‌ర్మిల విమ‌ర్శించారు.

బీహార్‌కు(Bihar) ప్రత్యేక హోదా(Special Status) ఇవ్వాలని సీఎం నితీష్(CM Nitish) తీర్మానం చేసి మోదీ(Modi) ముందు డిమాండ్ పెడితే ఏపీకి హోదాపై చంద్రబాబు(chandrababu) కనీసం నోరు విప్పడం లేదని APCC చీఫ్ వైఎస్ ష‌ర్మిల(YS sharmila) విమ‌ర్శించారు. సోమ‌వారం ఆమె ఈ విష‌య‌మై స్పందింస్తూ.. మోదీ సర్కార్ లో కింగ్ మేకర్ గా ఉన్న మీరు.. హోదాపై ఎందుకు మౌనం వహిస్తు న్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా బీహార్ కంటే వెనకబడి ఉన్నామని మీకు తెలియదా.? 15 ఏళ్లు హోదా కావాలని అడిగిన రోజులు మీకు గుర్తులేదా. రాష్ట్ర అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్లు వెనకబడిందని చెప్పింది మీరే కదా.? హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరణ అని ఎందుకు అడగడం లేదు.? మోసం చేసిన మోదీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరు.? అని ప్ర‌శ్న‌లు సంధించారు. ప్రత్యేక హోదాపై మీ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర హోదా డిమాండ్ పెట్టాలని.. చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. ప్రత్యేక ప్యాకేజీలు కాదు.. రాష్ట్ర అభివృద్ధికి హోదా ఒక్కటే మార్గమని అని గుర్తు చేస్తున్నామ‌న్నారు.

Eha Tv

Eha Tv

Next Story