YS Jagan Visit Tulluru : 26న సీఎం జగన్ తుళ్ళూరు పర్యటన
సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan)ఎల్లుండి గుంటూరు జిల్లా(Gunturu District) తుళ్ళూరు మండలం(Tulluru Mandal)వెంకటపాలెం పర్యటకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా జగనన్న కాలనీల్లోని పేదలకు ఇంటి స్ధలాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు.
సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan)ఎల్లుండి గుంటూరు జిల్లా(Gunturu District) తుళ్ళూరు మండలం(Tulluru Mandal)వెంకటపాలెం పర్యటకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా జగనన్న కాలనీల్లోని పేదలకు ఇంటి స్ధలాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఉదయం 9.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వెంకటపాలెం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం జగనన్న కాలనీల్లోని పేదలకు ఇంటి స్ధలాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.