‘సిద్ధం సభ’ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మార్చి 27న ఇడుపులపాయ నుంచి ‘మేమంత సిద్ధం’ యాత్రతో విస్తృత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

‘సిద్ధం సభ’ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మార్చి 27న ఇడుపులపాయ నుంచి ‘మేమంత సిద్ధం’ యాత్రతో విస్తృత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించడం ద్వారా వైఎస్‌ జగన్‌ తన యాత్రను ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు జగన్ బస్సులో యాత్రకు బయలుదేరుతారు.

ఈ యాత్రలో ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీఎన్ పల్లి (కమలాపురం), గంగిరెడ్డిపల్లి, ఉరుటూరు, యర్రగుంట్ల (జమ్మలమడుగు), పోట్లదుర్తితో సహా పలు కీలక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రొద్దుటూరు బైపాస్‌ రోడ్డులో వైఎస్‌ జగన్‌ ప్రసంగించనున్న బహిరంగ సభ యాత్రలో హైలెట్ గా నిల‌వ‌నుంది.

బహిరంగ సభ అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్‌, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్‌ రోడ్డులోని రాత్రి శిబిరానికి యాత్ర సాగనుంది.

Updated On 26 March 2024 9:00 AM GMT
Yagnik

Yagnik

Next Story