ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) మొట్టమొదటిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Telangana CM Revanth Reddy)పై కామెంట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల(YS Sharmila)ను నడిపిస్తున్నది రేవంత్‌రెడ్డి, ఆయన గురువు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu) అని జగన్ ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) మొట్టమొదటిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Telangana CM Revanth Reddy)పై కామెంట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల(YS Sharmila)ను నడిపిస్తున్నది రేవంత్‌రెడ్డి, ఆయన గురువు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu) అని జగన్ ఆరోపించారు. ఏపీలో కాంగ్రెస్‌, బీజేపీ రిమోట్‌లు చంద్రబాబు దగ్గరే ఉన్నాయని చెప్పారు. కడప లోక్‌సభ స్థానంలో తన చెల్లెలు పోటీ చేయడంపై తనకు ఎలాంటి బాధ లేదన్నారు జగన్. అయితే ఆమె డిపాజిట్‌ కూడా దక్కించుకోదేమోనన్న బాధ ఎక్కువగా ఉందని జగన్‌ చెప్పారు. తనపై నమోదైన అక్రమ ఆస్తుల కేసులో తన తండ్రి పేరును చేర్చిన కాంగ్రెస్‌ పార్టీ పక్షాన తన చెల్లెలు షర్మిల పనిచేయడం తనకు ఆవేదనగా ఉందని అన్నారు. షర్మిలను తనపై ఎగదోస్తున్నది రేవంత్‌, చంద్రబాబు అని జగన్‌ కుండబద్దలు కొట్టారు.

Updated On 30 April 2024 12:32 AM GMT
Ehatv

Ehatv

Next Story