ద‌త్త‌పుత్రుడి పేరు చెబితే అక్కాచెల్లెమ్మ‌ల‌కు వివాహ వ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్టుప‌ట్టించిన మోస‌గాడు గుర్తొస్తాడ‌ని..

నంద్యాల జిల్ల బ‌స‌గాన‌ప‌ల్లెలో వైఎస్ఆర్ ఈసీబీ నేస్తం కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. మరోసారి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. చంద్ర‌బాబు పేరు చెబితే.. అక్కాచెల్లెమ్మ‌ల‌కు ఆయ‌న చేసిన వంచ‌న గుర్తొస్తుంద‌ని.. పొదుపు సంఘాల మ‌హిళ‌ల‌కు ఆయ‌న చేసిన ద‌గా గుర్తొస్తుంద‌ని అన్నారు. ద‌త్త‌పుత్రుడి పేరు చెబితే అక్కాచెల్లెమ్మ‌ల‌కు వివాహ వ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్టుప‌ట్టించిన మోస‌గాడు గుర్తొస్తాడ‌ని.. ఐదేళ్ల‌కొక‌సారి కార్ల‌ను మార్చేసిన‌ట్లు భార్య‌ల‌ను మార్చే ఓ మ్యారేజ్ స్టార్ అని విమర్శించారు వైఎస్ జగన్. ఒక‌రికి విశ్వ‌స‌నీయ‌త‌, మ‌రొక‌రికి విలువ‌లు లేవన్నారు. ఇలాంటి వీళ్లు మూడు పార్టీలుగా.. కూట‌మిగా మీ బిడ్డ మీద‌కు యుద్ధానికి వ‌స్తున్నార‌ని జ‌గ‌న్ అన్నారు. పేద‌వాడి భ‌విష్య‌త్తు మీద‌కు యుద్ధంగా వ‌స్తున్నార‌ని సీఎం జగన్ అన్నారు.

నా అక్కచెల్లెమ్మలు బాగుండాలి, కుటుంబాలు బాగుండాలని ఎక్కడా కూడా కులం చూడటం లేదన్నారు సీఎం జగన్. వర్గం, మతం, ప్రాంతం, చివరకు ఏ పార్టీకి ఓటు వేశారనేది కూడా చూడటం లేదని తెలిపారు

Updated On 14 March 2024 3:25 AM GMT
Yagnik

Yagnik

Next Story