కొందరైతే ఆయనకు కల్ట్ ఫ్యాన్స్ లాగా అయిపోగా.. మరికొందరేమో తమ కుటుంబంలో ఒకరిలా భావిస్తూ ఉన్నారు

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగు ప్రజల్లో ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు. కొందరైతే ఆయనకు కల్ట్ ఫ్యాన్స్ లాగా అయిపోగా.. మరికొందరేమో తమ కుటుంబంలో ఒకరిలా భావిస్తూ ఉన్నారు. తాజాగా ఓ బామ్మ సీఎం జగన్ సిద్ధం సభలో పాల్గొనడానికి అందరికంటే ముందే వచ్చి కూర్చున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సిద్ధం సభ బామ్మ అని చెప్పగా.. నాకు తెలుసు.. నా మనవడిని చూడాలన్న ఉద్దేశ్యంతోనే తొందరగా వచ్చేశానని ఆమె చెప్పి.. సిద్ధం సభలో వేసిన కూర్చీల్లో కూర్చుంది. వైసీపీ కార్యకర్తలు బామ్మకు తాగడానికి నీళ్లు, టిఫిన్ అందించారు.

రాష్ట్రంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా బాపట్ల జిల్లా మేదర­మెట్ల సమీపంలోని పి.గుడిపాడు వద్ద ఆదివారం జరగనున్న ‘సిద్ధం’ సభకు సర్వం సిద్ధమైంది. అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల వద్ద కోల్‌కత–చెన్నై జాతీయ రహదారి పక్కనే వందలాది ఎకరాల సువిశాల మైదానంలో ఈ సభను నిర్వహించడానికి భారీ ఏర్పాట్లుచేశారు. దక్షిణ కోస్తాలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని 44 నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో కదలివస్తున్నారు.

Updated On 10 March 2024 4:14 AM GMT
Yagnik

Yagnik

Next Story