సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏప్రిల్ 8న 11వ రోజుకు చేరుకుంది

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూకుడుగా ప్రచారం చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే ఆయన చేసిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఊహించని సక్సెస్ లభించింది. ప్రజలను స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కలుసుకున్నారు. సీఎం జగన్ ను చూడడానికి పెద్ద ఎత్తున జనం కూడా రోడ్ల మీదకు వస్తూ ఉన్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏప్రిల్ 8న 11వ రోజుకు చేరుకుంది. సోమవారం నాటి షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ విడుదల చేసింది. ఈ యాత్రలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆదివారం రాత్రి బస చేసిన వెంకటాచలంపల్లి ప్రాంతం దగ్గర నుంచి సోమవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. ఉదయం 9.30 గంటలకు వెంకటాచలంపల్లి వద్ద సామాజిక పింఛన్‌ లబ్ధిదారులతో సీఎం జగన్ మాట్లాడనున్నారు. బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్డు వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత భోజన విరామం తీసుకుంటారు. చీకటిగల పాలెం మీదుగా మధ్యాహ్నం 3 గంటలకు వినుకొండకు చేరుకొని రోడ్‌ షోలో పాల్గొననున్నారు. కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెం చేరుకుంటారు. అక్కడే సీఎం జగన్ రాత్రి బసను ఏర్పాటు చేశారు.

Updated On 7 April 2024 9:48 PM GMT
Yagnik

Yagnik

Next Story