ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీ నేతలతో రేపు కీలక సమావేశాన్ని

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీ నేతలతో రేపు కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. తాడేపల్లిలో పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. 175 నియోజకవర్గాలకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కో ఆర్డినేటర్‌లతో సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై నేతలకు సీఎం జగన్‌ దిశా నిర్దేశం చేయనున్నారు.

మార్చి 3న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభ జరగనుంది. రాప్తాడులో నిర్వహించిన సభను మించి మేదరమెట్ల సభ నిర్వహించేలా వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు గుంటూరు, పల్నాడు, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల కార్యకర్తలు రానున్నారు. ఇప్పటికే భీమిలి, ఏలూరు, రాప్తాడులలో నిర్వహించిన 'సిద్ధం' సభలకు జనం భారీగా వచ్చారు. నేడు సీఎం జగన్ కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే!

Updated On 26 Feb 2024 12:21 AM GMT
Yagnik

Yagnik

Next Story