ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 15వ తేదీన రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 15వ తేదీన రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ఫిబ్రవరి 15వ తేదీన ఉదయం కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరుకానున్నారు. మధ్యాహ్నం తర్వాత గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో పాల్గొంటారు ఏపీ సీఎం.

ఈ రెండు జిల్లాల పర్యటన కోసం.. ఫిబ్రవరి 15న ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి కర్నూలు చేరుకుంటారు సీఎం జగన్‌. అక్కడ బళ్లారి రోడ్‌లోని ఫంక్షన్‌ హాల్‌లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు. ఆ తర్వాత గుంటూరు పర్యటనకు వెళ్తారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి చేరుకుంటారు. అక్కడ నిర్వహించనున్న వలంటీర్ల అభినందన సభలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి. సాయంత్రం తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు.

Updated On 13 Feb 2024 11:13 PM GMT
Yagnik

Yagnik

Next Story