ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మరణంపై వైసీపీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్

ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మరణంపై వైసీపీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆయన రామోజీ మరణంపై సంతాపం తెలిపారు. "రామోజీ రావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని వైఎస్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.

Updated On 7 Jun 2024 11:49 PM GMT
Yagnik

Yagnik

Next Story