ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసాల

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసాల వద్ద భద్రతను పెంచారనే వార్తలను అధికారులు ఖండించారు. గుంటూరు జిల్లా క్రైమ్ అదనపు ఎస్పీ శ్రీ శ్రీనివాస రావు మాట్లాడుతూ.. ఇలాంటి వదంతులను నమ్మకండని ప్రజలను కోరారు. ఎప్పుడు ఉండే భద్రత మాత్రమే ముఖ్యమంత్రి నివాసం వద్ద, చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఉందని తేల్చారు. అదనపు భద్రత కల్పించామనే వార్తలు పూర్తిగా అవాస్తమని తెలియజేశారు.

జూన్ 4వ తేధిదీన కౌంటింగ్ సందర్భంగా బందోబస్తుకు వచ్చిన సిబ్బంది.. వారి వారి డ్యూటీ పాయింట్ కు వెళ్తున్న సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది ఎక్కువగా కనిపిస్తూ ఉంటారని తెలిపారు. అంతేకాకుండా.. ఎప్పుడూ ఉండే భద్రతా సిబ్బంది మాత్రమే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి నివాసం వద్ద వున్నారని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఎలాంటి వదంతులను నమ్మకండని.. ఎన్నికల ఫలితాల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. భద్రతను పటిష్టం చేసినట్లు తెలిపారు.

Updated On 2 Jun 2024 8:24 PM GMT
Yagnik

Yagnik

Next Story