దత్తపుత్రా.. పెళ్లికి ముందు హామీలు ఇచ్చి, పిల్లల్ని కని, నాలుగైదేళ్లకోసారి కార్లను

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ పై ధ్వజమెత్తారు. ఇతరులు కార్లు మార్చినట్లుగా పవన్ కళ్యాణ్ తన భార్యలను మార్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రతి నాలుగు లేదా ఐదు సంవత్సరాలకు ఒకసారి జీవిత భాగస్వాములను మారుస్తారు.. అలాగే ప్రతి ఐదేళ్లకు ఒకసారి నియోజకవర్గాన్ని మారుస్తున్నారన్నారు. భీమవరం నుంచి పిఠాపురం సీటు మార్చుకోవాలని పవన్ నిర్ణయించుకున్న తరుణంలో జగన్ ఈ ప్రకటన చేశారు. ప్రతి ఒక్కరూ పవన్‌ను అనుసరించి ఒకటి కంటే ఎక్కువసార్లు పెళ్లి చేసుకుంటే సమాజం ఏమవుతుందని జగన్ ప్రశ్నించారు.

దత్తపుత్రా.. పెళ్లికి ముందు హామీలు ఇచ్చి, పిల్లల్ని కని, నాలుగైదేళ్లకోసారి కార్లను మార్చినట్టు భార్యలను, భార్యలను మార్చినట్టు నియోజకవర్గాలను అలవోకగా మార్చేస్తున్నావని ఏం మనిషివయ్యా నువ్వు? అని సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు. అయ్యా దత్తపుత్రా... ఒకసారి చేస్తే పొరపాటు అనుకోవచ్చు పదే పదే చేస్తుంటే దాన్ని అలవాటు అంటారయ్యా.. ఆడవారి జీవితాలను చులకనగా చూపించడం తప్పుకాదా అని ప్రశ్నించారు. నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ చేస్తే, ఇలా భార్యలను మార్చేస్తే అక్క చెల్లెమ్మల బ్రతుకు ఏం కావాలని అడిగితే.. ఆ పెద్ద మనిషిలో బీపీ పెరిగిపోతోందన్నారు. చేతులు ఊపుతూ, కాళ్లు ఊపుతూ, తల ఊపుతూ మనిషంతా ఊగిపోతాడన్నారు. దత్తపుత్రుడికి బీపీ వస్తే తట్టుకోలేమన్నారు సీఎం జగన్.

Updated On 16 April 2024 10:21 PM GMT
Yagnik

Yagnik

Next Story